జైపూర్: గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి దేశ వ్యాప్త యాత్రను ప్రారంభిస్తామని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ‘భారత్ జోడో యాత్ర’ నిర్వహిస్తామని చెప్పారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల చింతన్ శివిర్ ఆదివారంతో ముగిసింది. చివరి రోజున పార్టీ బలోపేతం కోసం పలు కీలక నిర్ణయాలను సోనియా గాంధీ ప్రకటించారు. ఒత్తిడిలో ఉన్న సామాజిక సామరస్య బంధాలను బలోపేతం చేయడానికి, దాడికి గురవుతున్న రాజ్యాంగం విలువలను పరిరక్షించడానికి, కోట్లాది మంది ప్రజల రోజువారీ ఆందోళనలను ఎత్తి చూపడానికి అక్టోబర్ 2 నుంచి ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
కాగా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంస్కరణల కోసం టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ తెలిపారు. అలాగే రాజకీయ సమస్యలను చర్చించడానికి సీడబ్ల్యూసీకి చెందిన ఒక సలహా బృందం క్రమం తప్పకుండా సమావేశమవుతుందని చెప్పారు. ‘మనం అన్నింటిని అధిగమిస్తాం’ అని పార్టీ నేతల్లో జోష్ నింపేందుకు సోనియా ప్రయత్నించారు. సామూహిక ప్రయోజనం కోసం మనం నిస్సందేహంగా స్ఫూర్తి, శక్తిని తిరిగి పొందుతామని అన్నారు.
మరోవైపు చింతన్ శివిర్ చివరి రోజైన ఆదివారం ‘నవ్ సంకల్ప్ డిక్లరేషన్’ను కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. త్వరలో జరుగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు రానున్న లోక్సభ ఎన్నికల సమరానికి సిద్ధమయ్యేందుకు పార్టీలో విస్తృత సంస్కరణల కోసం రోడ్ మ్యాప్ను ప్రకటించింది.