Assembly Election results 2022 live updates : యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. రెండు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకొంటుందా? పంజాబ్లో సత్తా చాటి ఊపుమీదున్న ఆప్ సంచలనం సృష్టిస్తుందా? కాంగ్రెస్ పునర్వైభవం సొంతం చేసుకుంటుందా? అన్నది ఇవాళ తేలనున్నది. హిమాచల్ప్రదేశ్లో నవంబర్ 12న, గుజరాత్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో నిర్వహించిన పోలింగ్ ఫలితాల లెక్కింపు 8 గంటలకు ప్రారంభం అవుతుంది. గుజరాత్లో మళ్లీ బీజేపీయే అధికారం చేపడుతుందని, హిమాచల్ప్రదేశ్లో మాత్రం బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నదని అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనావేశాయి.
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే 92 స్థానాల్లో గెలవాల్సిందే. ఇక హిమాచల్ప్రదేశ్లో 68 స్థానాలు ఉన్నాయి. మెజార్టీ మార్కుకు 34 స్థానాల్లో విజయం సాధించాలి. కాగా, 1985 నుంచి వరుసగా రెండుసార్లు ఏ పార్టీకి పట్టంకట్టని హిమాచల్ ప్రజలు ఈ సారి ఆ ఆనవాయితీని కొనసాగిస్తారా అనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగుతుండటంతో సీఎం జైరాం ఠాకూర్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని, సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు జైరాం ఠాకూర్ పేర్కొన్నారు.
గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రఘు శర్మ రాజీనామా చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. తన రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని కోరారు.
హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో సీఎం పదవికి జైరాం ఠాకూర్ రాజీనామా చేశారు. రాజీనామాను గవర్నర్కు పంపినట్లు తెలిపారు. ప్రజాతీర్పును శిరసా వహిస్తామన్న ఆయన కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. సెరాజ్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన జైరాం ఠాకూర్ ఘన విజయం సాధించినా.. బీజేపీ ఓటమి పాలైంది. ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకున్నది. బీజేపీ 26చోట్ల గెలువగా.. ముగ్గురు స్వతంత్రులు విజయాన్ని సాధించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి గోపాల్ ఇతాలియా పరాజయం పాలయ్యారు. ఇతాలియాపై బీజేపీ అభ్యర్థి వినోద్ మోరాదియా గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఏడోసారి అధికారాన్ని కైవసం చేసుకున్నది. ఇప్పటి వరకు 133 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించగా, మరో 24 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో గెలుపొంది, మరో ఏడుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆప్ నాలుగు చోట్ల విజయం సాధించి, ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 35 స్థానాలను దాటింది. రాష్ట్రంలో 68 స్థానాలకు గాను కాంగ్రెస్ 36 స్థానాల్లో విజయం సాధించింది. మరో నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార బీజేపీ 23 స్థానాల్లో గెలుపొందగా.. మరో రెండు చోట్ల ముందంజలో ఉంది. మరో వైపు హిమాచల్ప్రదేశ్లో ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని ఓటర్లు కొనసాగించారు.
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం నమోదు చేసింది. ఇప్పటి వరకు 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో ఆరుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది. బీజేపీ 23చోట్ల గెలుపొందగా.. మరో రెండుచోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ విజయం ఖరారు కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి.
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీని సాధించింది. ఇప్పటి వరకు 121 స్థానాల్లో గెలుపొందగా.. 35 ఆధిక్యంలో కొనసాగుతున్నది. పార్టీ గెలుపొందడంతో ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్ వెల్లడించారు.
వరుసగా ఏ పార్టీకి రెండు సార్ల పట్టంకట్టని హిమాచల్ ప్రజలు చరిత్రను పునరావృతం చేశారు. అధికార బీజేపీని ప్రతిపక్షానికి పంపించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో విజయం సాధించి, మరో 27 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని కాంగ్రెస్ పార్టీ నేత విక్రమాదిత్య సింగ్ అన్నారు. తాము పూర్తికాలం అధికారంలో కొనసాగుతామని ధీమా వ్యక్తం చేశారు. అధికారం కోసం బీజేపీ ఏమైనా చేయగలదని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, ఎమ్మెల్యేలను కాపాడుకుంటామని చెప్పారు.
హిమాచల్ప్రదేశ్ ఫలితాలపై ఎట్టకేలకు ఓ స్పష్ట వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, మరో 10 చోట్ల విజయం సాధించింది. బీజేపీ ఇప్పటివరకు 12 స్థానాల్లో గెలుపొందింది. మరో 14 సీట్లలో లీడ్లో ఉన్నది. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఆధిక్యంలో ఉండగా, ఒకరు విజయం సాధించారు. కాగా, రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలుండగా, 35 స్థానాల్లో విజయం సాధించిన పార్టీయే అధికారం చేపట్టనుంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో పోలైన మొత్తం ఓట్లలో సగానికిపైగా కమలం పార్టీకే దక్కాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 53.67 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. 182 స్థానాలు ఉన్న గుజరాత్లో.. బీజేపీ ఇప్పటివరకు 19 స్థానాల్లో విజయం సాధింగా 135 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. ఇక ఒక చోట గెలుపొంది, 19 స్థానాల్లో ముందంజలో ఉన్న కాంగ్రెస్కు 26.6 శాతం, ఆమ్ ఆద్మీకి 12.8 శాతం ఓట్లను పంచుకున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి లోక్సభకు జరిగిన ఉపఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ భారీ విజయం దిశగా సాగుతున్నారు. తన సమీప ప్రత్యర్థిపై ఆమె 77,875 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ షక్య 34,472 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీలు పోటీ చేయలేదు.
హిమాచల్ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యం ఇరు పార్టీల మధ్య మారుతూ వస్తున్నది. అయితే ఇప్పుడిప్పుడే ఫలితాలు వెడువడుతుండటంతో క్రమంగా స్పష్టత వస్తున్నది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఇప్పటివరకు 5 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటులో గెలుపొందింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ మరో 37 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కమలం పార్టీ 22 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నది. మరో మూడు స్థానాల్లో స్వంతంత్రులు లీడ్లో ఉన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విజయం సాధించారు. గట్లోదియా స్థానం నుంచి పోటీచేసిన ఆయన తన సమీప ప్రత్యర్థిపై భారీ మెజార్టీ సాధించారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో సీఎంతో పాటు మరో 13 మంది విజయం సాధించారు. వారిలో అమిత్భాయ్ షా (ఎల్లిస్బ్రిడ్జ్), రమేశ్బాయ్ పటేల్ (జలాల్పోర్), దర్శిత షా (రాజ్కోట్ పశ్చిమ), కన్నయ్యలాల్ కిశోరి (దహోద్), కౌశిక్భాయ్ జైన్ (దరియాపూర్) గెలుపొందారు. మరో 141 మంది ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. జమాల్పూర్ కదియా నుంచి పోటీచేసిన ఆ పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ ఖేదావా గెలుపొందారు. హస్తం పార్టీ మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది.
గుజరాత్లో బీజేపీ విజయపరంపరను అడ్డుకుందామనుకున్న ఆప్కు ఓటర్లు షాకిచ్చారు. అధికారమే లక్ష్యంగా బరిలోకిదిగిన ఆ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఓటమి అంచున ఉన్నారు. సూరత్ కటర్గామ్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన పార్టీ చీఫ్ గోపాల్ ఇటాలియాపై బీజేపీ అభ్యర్థి వినోద్ మోరాదియా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఖంభాలియా స్థానం నుంచి పోటీచేసిన ఆప్ సీఎం అభ్యర్థి గెలుపు దిశగా పయణిస్తున్నారు.
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరిచింది. సుందేర్నగర్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి రాకేశ్ కుమార్ విజయం సాధించారు. సెరాజ్ స్థానంలో సీఎం జైరాం ఠాకూర్ గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ 29 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఇక కాంగ్రెస్ 34 సీట్లలో, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హిమాచల్ప్రదేశ్లో ఉత్కంఠ కొనసాగుతున్నది. కాంగ్రెస్, బీజేపీ మధ్య మెజార్టీ మారుతూవస్తున్నది. దీంతో రెండు పార్టీలు మెజార్టీ మార్కుకు ముందే ఆగిపోయాయి. ప్రస్తుతం కాంగ్రెస్ 30 స్థానాల్లో లీడ్లో ఉండగా, బీజేపీ 34, ఇతరులు 4 సీట్లలో ముందంజలో కొనసాగుతున్నారు. దీంతో అధికారంలోకి వచ్చేది అనేదానిపై ఇంకా స్పష్టత రావడానికి మరికొద్దిసేపు ఆగాల్సిందే. అయితే స్వతంత్ర అభ్యర్థుల్లో ముగ్గురు బీజేపీ రెబల్స్ కాగా, ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడం గమనార్హం. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో వారి మద్దతు కీలకం కానున్నది. కాగా, స్పష్టమైనా మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమవుతున్నారు. తమ అభ్యర్థులు చే జారిపోకుండా జాగ్రత్త పడుతున్నది. ఫలితాలు వెలవడగానే గెలిచినవారిని క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
Rampur By Election Results | ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. రాంపూర్లో మూడో రౌండ్ కౌంటింగ్ ముగిసే వరకు సమాజ్వాదీ పార్టీకి 5,767 ఓట్లు, బీజేపీకి 2,543 ఓట్లు పోలవగా.. సమాజ్వాదీ పార్టీ 3,224 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది.
హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ తపలడుతున్నాయి. ఇరుపార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడుతున్నది. హిమాచల్లోని మొత్తం 68 స్థానాల్లో కాంగ్రెస్ ప్రస్తుతం 36 స్థానాల్లో ముందంజలో ఉన్నది. బీజేపీ 29 స్థానాల్లో, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అధికారంలోకి రావాలంటే మెజార్టీ మార్క్ 35 దాటాల్సి ఉంటుంది. అయితే రెండు పార్టీల మధ్య ఆధిక్యం అణుక్షణం మారుతుండటంతో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది.
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింతగా దిగజారింది. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. దీంతో మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుంది. 2017 ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ.. ఈ సారి కనీసం 30 స్థానాలను కూడా దక్కించుకునేలా కనిపించడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 23 స్థానాల్లో ముందంజలో ఉన్నది. అంటే గత ఎన్నికలతో పోల్చితే ఆ పార్టీ 54 స్థానాలను కోల్పోయింది. ఇక అధికార బీజేపీ 150 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇక ఆప్ 5 స్థానాలకే పరిమితమైంది. మరో 4 చోట్ల ఇతరలు లీడ్లో కొనసాగుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. వరుసగా రెండుసార్లు ఏ పార్టీకి అధికారం ఇవ్వని హిమాచల్ ఓటర్లు.. ఈసారి ఎవ్వరికీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్, బీజేపీలు మెజార్టీ మార్కుకు చేరువలో నిలిచిపోయాయి. హిమాచల్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలు ఉన్నాయి. ఇందులో 35 చోట్ల గెలుపొందిన పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ 32 స్థానాల్లో, బీజేపీ 32 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. మరో నాలుగు సీట్లలో ఇతరులు ముందంజలో కొనసాగుతున్నారు. దీంతో అధికారం కోసం రెండు పార్టీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. అయితే ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందనేదానిపై మరికాసేపట్లో స్పష్టత రానుంది.
గుజరాత్లో అధికార బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అత్యధిక స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో కొనసాగుతున్నది. అసెంబ్లీలోని 182 స్థానాలకుగాను ఆ పార్టీ అభ్యర్థులు 141 చోట్ల ముందంజలో కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో, ఆప్ 11, ఇతరులు 5 చోట్ల లీడ్లో ఉన్నారు. కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ 77 చోట్ల విజయం సాధించింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధికార బీజేపీ టికెట్పై నార్త్ జామ్నగర్ నుంచి ఆమె బరిలోకి దిగారు. రివాబా తరఫున జడేజా కూడా విస్తృంగా ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం ఆమె తన సమీప ప్రత్యర్థిపై ముందంజలో కొనసాగుతున్నారు. ఇక గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఘాట్లోడియా నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఎన్నికలకు కొన్నిరోజుల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్ వీరంగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి లఖాభాయ్ భర్వాడ్పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే రెండు రాష్ట్రాల్లోనూ చీపురు పార్టీ అసలు తన ఉనికినే చాటుకోలేకపోయింది. ఢిల్లీ, పంజాబ్ తర్వాత గుజరాత్, హిమాచల్లో అధికారం చేజిక్కుంచుకోవాలనుకున్న అరవింద్ కేజ్రీవాల్ను ఓటర్లు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. రెండు రాష్ట్రాల్లోనూ అనుకున్నంతగా రానించలేకపోయింది.
గుజరాత్లో బీజేపీ 122 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 41 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక ఆప్ 13 సీట్లలో, ఇతరులు మరో ఏడు చోట్ల ముందంజలో కొనసాగుతున్నారు. అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. ఇందులో 92 స్థానాల్లో విజయం సాధించిన పార్టీ అధికారంలో రానుంది. అయితే బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ మార్కును దాటేసింది.
హిమాచల్ప్రదేశ్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఆమ్ఆద్మీ పార్టీ అసలు ఖాతా తెరవలేదు. కాంగ్రెస్ 35 స్థానాల్లో లీడ్లో ఉండగా, బీజేపీ 28 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది.
గుజరాత్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఇందులో 73 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 27 సీట్లలో, ఆప్ 5, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. ఇందులో 92 స్థానాల్లో విజయం సాధించిన పార్టీ అధికారంలో రానుంది.
రెండు విడుతల్లో సాగిన ఎన్నికల్లో మొదటి విడుతో 63.31 శాతం, రెండో విడుతలో 65.22 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1621 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
హిమాచల్ప్రదేశ్లో ఎగ్జిట్పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కన్పిస్తున్నాయి. హిమాలయ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతున్నది. హస్తం పార్టీ 35 స్థానాల్లో లీడ్లో ఉండగా, బీజేపీ 22 సీట్లలో ఆధిక్యంలో ఉన్నది. ఇతరులు మరో 4 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 68 స్థానాలు ఉన్నాయి. ఇందులో 35 సీట్లలో గెలుపొందినవారే అధికారం చేజిక్కించుకోనున్నారు. అయితే 1985 నుంచి రాష్ట్రంలో వరుసగా రెండో సారి ఏ పార్టీ అధికారంలోకి రాలేదు.
గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఇప్పటివరకు హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ 21 సీట్లలో, బీజేపీ 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. గుజరాత్లో బీజేపీ 35 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 10, ఆప్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
ఇక గుజరాత్ అసెంబ్లీలో 182 సీట్లు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే 92 మెజార్టీ మార్క్ దాటాల్సి ఉంటుంది. ఇక హిమాచల్ ప్రదేశ్లో 68 స్థానాల్లో ఉండగా 35 సీట్లలో విజయం సాధించిన పార్టీ ముఖ్యమంత్రి పదవి దక్కించుకోనుంది.