గువహటి : కుకి మిలిటెంట్స్ను కలిసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అరెస్ట్ చేయాలని అసోం కాంగ్రెస్ (Assam Congress) చీఫ్ భూపేన్ బోరా డిమాండ్ చేశారు. శర్మ ఆదివారం కుకీ మిలిటెంట్ గ్రూపులను కలిసి కేంద్ర ప్రభుత్వం తరపున శాంతి, సామరస్య ప్రణాళికలను వారి ముందుంచారు.
కుకి మిలిటెంట్స్తో రాజ్యాంగవిరుద్ధంగా సంబంధాలు నెరిపిన హిమంత బిశ్వ శర్మకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గువహటిలో నిరాహార దీక్ష చేపట్టింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఓ ముఖ్యమంత్రి మణిపూర్ ఎన్నికల్లో గెలిచేందుకు కుకి మిలిటెంట్స్ను కలవడం తాము తొలిసారిగా విన్నామని బోరా పేర్కొన్నారు.
మిలిటెంట్ గ్రూప్ నేత స్వయంగా ఈ విషయం వెల్లడించారని, శర్మపై బీజేపీ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందా అని తాము వేచిచూస్తున్నామని కాంగ్రెస్ నేత అన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అప్పటి ఈశాన్య రాష్ట్రాల బీజేపీ ఇన్చార్జ్లు రాంమాధవ్, హిమంత బిశ్వ శర్మ కుకి సంస్ధల మద్దతు తీసుకున్నారని కుకి సంస్ధల్లో ఒకటైన ఓ సంస్ధ నేత 2019లో కేంద్ర మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో ప్రస్తావించారని బోరా పేర్కొన్నారు.
Read More :