గౌహతి : కూరగాయల ధరల పెరుగుదలపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గురువారం అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ధరల పెరుగుదలకు మియా ముస్లింలే(తూర్పు బెంగాల్కు చెందినవారు) కారణమని ఆరోపించారు. దీనిపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్లో స్పందించారు. ఈ దేశంలో ఒక వర్గం వారు తమ ఆవు పాలివ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టకపోయినా ముస్లింలనే పరోక్షంగా నిందిస్తున్నారని అన్నారు.