CM Himanta Sarma | గువహటి, ఏప్రిల్ 17: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన రాహుల్గాంధీ, ప్రియాంకలను అమూల్ బేబీలంటూ వెటకారం చేశారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ. ప్రియాంక గాంధీ ఇటీవలే అసోంలో రోడ్ షో చేపట్టారు. దీనిపై స్పందించిన బిశ్వశర్మ అమూల్ బేబీలను చూసేందుకు జనమెందుకు వెళతారు? దానికన్నా కజిరంగా నేషనల్ పార్క్కు వెళ్లాలనుకుంటారని ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబాన్ని చూడటం వల్ల తమకేం ఒరగదని ప్రజలు భావిస్తున్నట్టు హిమంత బిశ్వశర్మ తెలిపారు.