Assam : అస్సాం (Assam) లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) షెడ్యూల్ విడుదల చేయడంతో ఆ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎన్నికల సందడి మొదలైంది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనుంది. మే 4న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. 2021 ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమి విజయం సాధించింది.
సీఎం హిమాంత బిశ్వశర్మ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి మొత్తం 126 స్థానాల నుంచి 75 స్థానాలను గెలుచుకుని రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా విజయం సాధించి వరుసగా మూడో సారి సీఎం పదవి చేపట్టాలని హిమాంత బిశ్వశర్మ తహతహలాడుతున్నారు. ఇదిలావుంటే ఈ ఎన్నికల కోసం బీజేపీ మార్చి 16 లేదా 17వ తేదీన ఒకేసారి అందరు అభ్యర్థుల పేర్లను ప్రకటించబోతోంది. ఈ విషయాన్ని హిమాంత బిశ్వశర్మ ఇటీవల ప్రకటించారు.