చెన్నై: హిందువుల షాపుల్లోనే కొనాలంటూ ప్రచారం చేస్తున్న హిందూ సంస్థ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వెంగమేడులోని జ్యోతిదార్ వీధిలో నివాసం ఉంటున్న 32 ఏళ్ల శక్తి, హిందూ మున్నాని కరూర్ జిల్లా కోఆర్డినేటర్గా పని చేస్తున్నాడు. దీపావళి సందర్భంగా హిందువుల షాపుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నాడు. అలాగే ఏదైనా షాపులోకి ప్రవేశించిన తర్వాత హిందూ దేవుళ్ల ఫోటోలు ఉంటేనే అక్కడ కొనుగోలు చేయాలని వినియోగదారులకు సూచిస్తున్నాడు.
మరోవైపు ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో హిందూ మున్నాని కార్యకర్త శక్తిని అరెస్ట్ చేశారు. సమాజంలో మత విభజనకు పాల్పడటం, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించడం వంటి ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. కాగా, హిందూ మున్నాని సంస్థ కార్యకర్తలు నిరసనకు దిగారు. తమ కార్యకర్త శక్తిని అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. అతడ్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.