న్యూఢిల్లీ : మనిషిలాగే ఓ ఏనుగు అరటి పండును తోలు వలిచి పండును తిన్న వీడియో (Viral Video) సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. సైన్స్ ఎక్స్ అనే పేజ్ ఈ క్లిప్ను యూట్యూబ్లో షేర్ చేసింది. బెర్లిన్ జూలో ఈ ఘటన జరిగింది.
ఈ వీడియోలో పంగ్ ఫా అనే ఆసియా ఏనుగు అరటి పండును ముందుగా తొక్క తీసివేసి ఆపై పండును తినేయడం కనిపిస్తుంది. తొండం సాయంతో తోలు వలిచి ఆపై అరటి పండును ఏనుగు తినేస్తోంది. యల్లో బనానాలను తింటున్న ఏనుగు బ్రౌన్ బనానాలను వదిలేస్తోంది.
ఈ వైరల్ క్లిప్ను ఇప్పటివరకూ 32,000 మంది వీక్షించగా ఏనుగు నైపుణ్యాలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ట్రూలీ అమేజింగ్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఏనుగు భిన్నమైన నైపుణ్యాలను కలిగిఉందని మరో యూజర్ రాసుకొచ్చారు.