న్యూఢిల్లీ, జనవరి 31: అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) రూపిందర్ సింగ్ సూరి కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. 2020 జూన్లో ఏఎస్జీగా రూపిందర్ నియమితులయ్యారు. 2009లో సీనియర్ అడ్వొకేట్గా గుర్తింపు పొందిన ఆయన.. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీం కోర్ట్ అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.
సీజేఐ సంతాపం
ఆర్ఎస్ సూరి అకాల మరణం పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.