జైపూర్ : లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూ తీవ్ర అస్వస్ధతకు గురవడంతో జోధ్పూర్లోని ఎయిమ్స్కు శనివారం తరలించారు. కాలేయం, యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆశారాం బాపూను దవాఖానలోని ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 48 గంటల పాటు ఆయనను వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని అధికారులు తెలిపారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆశారాం బాపూను జైలు నుంచి నెలకు ఒకటి, రెండు సార్లు మెడికల్ చెకప్ కోసం దవాఖానకు అధికారులు తీసుకువస్తుంటారు. ఆశారాం దవాఖానకు వస్తున్న సమాచారం బయటకు రావడంతో పెద్దసంఖ్యలో ఆయన అనుచరులు జోధ్పూర్ ఎయిమ్స్ వద్దకు చేరుకున్నారు.