హైదరాబాద్/ లక్నో: హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్కు చెందిన
అప్నా దళ్ (కామెరవాది)తో పొత్తు పెట్టుకున్నారు. పల్లవి పటేల్కు చెందిన ఆ పార్టీతో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. (AIMIM Ties Up With Apna Dal (K) ) ‘పిచ్డా, దళిత్, ముసల్మాన్’ పేరుతో పీడీఎం కూటమిగా ఏర్పడ్డారు. ప్రేమ్ చంద్ బింద్కు చెందిన ప్రగతిశీల మానవ్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ ఉదయ్ పార్టీ వంటి ఇతర పార్టీలు కూడా ఈ కూటమిలో ఉన్నాయి.
కాగా, చాలా కాలంగా అప్నా దళ్ (కే)తో పొత్తు ఉన్న సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఇటీవల ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. ఎస్పీ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయిన పల్లవి పటేల్ ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేసేందుకు నిరాకరించింది. ముగ్గురు ఎస్పీ అభ్యర్థుల్లో కేవలం దళిత వ్యక్తికే తాను ఓటు చేసినట్లు ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అప్నా దళ్ (కే)తో తమకు ఎలాంటి పొత్తు లేదని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.