లక్నో: కోవిడ్ పాజిటివిటీ రేటుతో పాటు రోజు వారి ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను ఎత్తివేశారు. కరోనా కేసులు క్రమంగా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ అదనపు కార్యదర్శి అవనిశ్ అవాస్తి తెలిపారు. గడిచిన 24 గంటల్లో యూపీలో కొత్తగా 842 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది. గడ వారం 15వేల ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 8వేలకు పడిపోయింది.