న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన జైలు నుంచి ఇప్పటికే రెండు సార్లు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఆయన భార్య సునితా కేజ్రీవాల్(Sunita Kejriwal) ఇవాళ మీడియాతో మాట్లాడారు. పలుమార్లు ఈడీ తమ ఇండ్లల్లో రెయిడ్ చేసినా.. ఒక్కసారి కూడా చిల్లిగవ్వ దొరకలేదని ఆమె అన్నారు. మార్చి 28వ తేదీన కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరు అవుతారని, కోర్టులో ఆయన ఆ డబ్బు గురించి వెల్లడిస్తారని సునిత తెలిపారు.
పత్రికా ప్రకటన చేసిన సునితా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. జలశాఖ మంత్రికి తన భర్త ఆదేశాలు ఇచ్చారని, కానీ కేంద్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని, వాళ్లను ఢిల్లీని నాశనం చేయాలనుకుంటున్నారా అని ఆమె ప్రశ్నించారు. మంగళవారం రోజున ఈడీ ఆఫీసులో కేజ్రీవాల్ను సునిత కలిశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.