Sanjay Raut | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఉద్ధవ్ వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్కు పెరుగుతున్న ఆదరణ చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు. ఈడీ కస్టడీలో నుంచి ప్రభుత్వాన్ని నడపాలన్న కేజ్రీవాల్ నిర్ణయానికి రౌత్ మద్దతు తెలిపారు. ఈడీ అరెస్టు తర్వాత బీజేపీపై కేజ్రీవాల్ మరింత దూకుడు పెంచారన్నారు. అరవింద్ కేజ్రీవాల్ను స్వాతంత్య్ర సమరయోధులతో పోల్చిన సంజయ్ రౌత్, స్వాతంత్య్ర పోరాటంలో జైలుకు వెళ్లిన నాయకులందరూ ఆ తర్వాత మరింత బలంగా తయారయ్యారన్నారు.
ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ప్రతిపక్ష పార్టీ ‘ఇండియా’ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వస్తారని.. విపక్ష నేతలంతా ఏకం కానున్నారన్నారు. కేజ్రీవాల్ నిర్బంధానికి వ్యతిరేకంగా ఏకమవుతున్నామని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని.. ఇప్పుడు ఆయన జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతుంటే.. ఆయనకు మద్దతుగా చాలా మంది వీధుల్లోకి వస్తున్నారన్నారు. ఇక ప్రతిపక్ష కూటమి మధ్య సీట్ల పంపకాలపై ఆయనను మీడియా ప్రశ్నించగా.. శివసేన యూబీటీ 15-16 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మంగళవారం ప్రకటించనున్నట్లు రౌత్ తెలిపారు.