న్యూఢిల్లీ, డిసెంబర్ 22: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 3న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది మూడోసారి.
ఈసారి హాజరు కాకపోతే కేజ్రీవాల్పై నాన్బెయిలబుల్ వారెంట్ను జారీ చేసే అవకాశం ఉంది. గతంలో నవంబర్ 2, డిసెంబర్ 21 తేదీలలో ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. కేజ్రీవాల్ విపాసన మెడిటేషన్ కోర్సుకు హాజరు కావాల్సి ఉందని, ఇది ముందే నిర్ణయించిన కార్యక్రమం కాబట్టి ఆయన ఈడీ ముందుకు రాలేరని రెండో నోటీసు సందర్భంగా పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.