న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆ పార్టీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను ఆదివారం ఆసుపత్రిలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనను కేజ్రీవాల్ హత్తుకున్నారు. సత్యేందర్ జైన్ ఆరోగ్యంతోపాటు ఆయనకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ధైర్యవంతుడ్ని, హీరోని కలిశాను’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీ మాజీ మంత్రి అయిన సత్యేందర్ జైన్ను మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత ఏడాది మే నెలలో అరెస్ట్ చేసింది. సుమారు ఏడాదికి పైగా ఆయన జైలులో ఉన్నారు. అనారోగ్యానికి గురై బరువు తగ్గిన సత్యేందర్ జైన్ ఇటీవల జైలులోని బాత్రూమ్లో పడిపోగా తలకు, చేతికి గాయమైంది. ఈ నేపథ్యంలో సత్యేందర్ జైన్కు ఆరు వారాలపాటు మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. దీంతో ఏడాది తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన ఢిల్లీలోని లోక్ నాయక్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. తల, చేతి గాయానికి చికిత్స పొందుతున్నారు.
Met the brave man…..the hero.. pic.twitter.com/d5gzKoDud9
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 28, 2023