న్యూఢిల్లీ/లక్నో, జూన్ 7: ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను తలుచుకొని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం నిర్మించిన ఓ పాఠశాల కొత్త భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ… ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్య అందాలని సిసోడియా కలలు కన్నారని గుర్తుచేసుకొని కంటతడి పెట్టారు. పాఠశాలలకు మంచి భవనాలు నిర్మిస్తున్నందుకు, పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకే ఆయనను అరెస్టు చేశారని ఆరోపించారు.