పనాజీ: గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. అమిత్ పాలేకర్ తమ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. గోవాలో ఉన్న 40 స్థానాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అమిత్ పాలేకర్ వృత్తి రీత్యా అడ్వకేట్. ఆయన భండారి సామాజిక వర్గానికి చెందినవారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఉచిత విద్యుత్తు, ఉచిత నీరు పథకాలతో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్లుతోంది. గోవాలోనూ అదే నినాదాన్ని ఆ పార్టీ వినిపించింది.