Punjab | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయనో రాజకీయ పర్యాటకుడు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. గత నాలుగైదు సంవత్సరాలుగా ఆయనకు పంజాబ్ గుర్తుకు రాలేదని, ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ రూపొందించిన పంజాబ్ మోడల్పై సిద్దూ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మోడల్ అంతా కాపీ కొట్టిన మోడల్ అంటూ సిద్దూ దెప్పిపొడిచారు.
ఏమాత్రం అక్షర జ్ఞానం లేని వారిని ఓ పది మంది పోగు చేసుకొని, కొన్ని పాయింట్లు రాసేసి, పంజాబ్ మోడల్ అంటే సరిపోతుందా? అంటూ సిద్దూ విరుచుకుపడ్డారు. ఇలా చేయడం పంజాబ్ ప్రజలను అపహాస్యం చేయడమేనని విమర్శించారు. కేజ్రీవాల్ మోడల్ కాపీకొట్టిన మోడల్ అని, లిక్కర్ మాఫియా మోడల్ అని, డబ్బులకు టిక్కెట్లిచ్చే మోడల్ అని, అభద్రతా భావంతో ఉన్న మోడల్ అంటూ సిద్దూ అభివర్ణిస్తూ కేజ్రీవాల్పై విరుచుకుపడ్డారు.