న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్ సరిహద్దు వెంట తమ భూభాగంలో ఒక బాలుడిని గుర్తించామంటూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఆదివారం భారత సైన్యానికి సమాచారం ఇచ్చింది. అతన్ని త్వరలో భారత్కు అప్పగిస్తామని పేర్కొన్నది. ఇటీవల అరుణాచల్ప్రదేశ్కి చెందిన మిరాం తరోన్ అనే బాలుడిని పీఎల్ఏ అపహరించిందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారంపై భారత సైనిక వర్గాలు స్పందించాయి. బాలుడిని అప్పగిస్తామని చెప్పిన చైనా ఆర్మీ.. అయితే అతని గుర్తింపును ధ్రువీకరించలేదని పేర్కొన్నాయి.