పనాజీ: ఒక కళాకారుడు అవుట్డోర్ జిమ్ను ఇన్కార్నేషన్ పార్క్గా మార్చాడు. సందర్శకులను ఇది ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఈ నెల 15న గోవాలో సెరెండిపిటీ ఆర్ట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ నెల 23 వరకు జరిగే ఈ ఫెస్టివల్లో దక్షిణ భారత్కు చెందిన పలువురు కళాకారులు తమ నైపుణ్యాన్ని వైవిధ్యంగా చాటనున్నారు. సాంకేతికత, కళారంగాన్ని అది ప్రభావితం చేసిన తీరును ఈ ఏడాది ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కళాకారుడు దీప్తేజ్ వెర్నేకర్ ఒక అవుట్డోర్ జిమ్ను ఇన్కార్నేషన్ పార్క్గా తీర్చిదిద్దారు. రావణాసురుడు వంటి భారత పురాణగాథల పాత్రలతో కూడిన జిమ్ పరికరాలను రూపొందించాడు. సందర్శకులను ఇది ఎంతగానో ఆకట్టుకుంటున్నది. వారు వ్యాయామం చేయడంతోపాటు వినోదాన్ని కూడా పొందుతున్నారు.
మరోవైపు కళాకారుడు దీప్తేజ్ వెర్నేకర్ ఈ ఇన్కార్నేషన్ పార్క్ గురించి మీడియాకు వివరించారు. బహిరంగ వ్యాయామశాలను ఇంటరాక్టివ్గా మార్చడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. స్థానిక కళాఖండాలు వెలుగులోకి వస్తాయని, వినూత్న పబ్లిక్ పార్కుల రూపకల్పనకు దోహదపడతాయని చెప్పారు.