న్యూఢిల్లీ, జూలై 11: జమ్ముకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమో కాదో తేల్చేందుకు ఆగస్టు 2 నుంచి రోజువారీ విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది.
ఈ ఆర్టికల్ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అన్నింటిని కలిపి విచారించనున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మంగళవారం వెల్లడించారు. ఈ విచారణ జరుగుతున్నంతకాలం కొత్త పిటిషన్లను మాత్రమే స్వీకరిస్తామని, పాత పిటిషన్లపై విచారణ ఉండదని పేర్కొన్నారు.