బటిండా: అవినీతి కేసులో పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత మన్ప్రీత్ సింగ్ బాదల్కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. మన్ప్రీత్ ఇల్లు, కార్యాలయంపై పంజాబ్ విజిలెన్స్ విభాగం సోదాలు నిర్వహించిన మరుసటి రోజే బటిండా అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మరోవైపు విజిలెన్స్ విభాగం కూడా మన్ప్రీత్కు మంగళవారం లుకౌట్ నోటీస్ జారీచేసింది.
అవినీతి కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మన్ప్రీత్ బాదల్ దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఎయిర్పోర్ట్స్ను అప్రమత్తం చేశారు. కాగా, బటిండా (Bathinda) ఆస్తుల కొనుగోళ్లలో బాదల్ అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
ఈ మేరకు బాదల్ సహా మరో ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు బాదల్తోపాటు గతంలో బటిండా డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన బిక్రంజీత్ షేర్గిల్, రాజీవ్ కుమార్, అమన్దీప్ సింగ్, వికాశ్ అరోరా, పంకజ్ లకు మంగళవారం నోటీసులు ఇచ్చారు. ఆపై అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆరెస్ట్ వారెంట్ జారీ చేశారు.