Murder: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య తల నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తెగ నరికిన భార్య తల ఒక చేతిలో, కత్తి మరో చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చాడు. వందల మంది పాదచారులు చూస్తుండగా రోడ్డుపై చాలా దూరం నడుచుకుంటూ వెళ్లాడు. దాంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. బారాబంకీ జిల్లాకు చెందిన అనిల్ అనే వ్యక్తి తాపీ మేస్త్రీ పనిచేస్తే జీవనం గడుపుతున్నాడు. ఎనిమిదేండ్ల క్రితం ఓ మహిళను పెండ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. అయితే, భార్య మరో వ్యక్తి వివాహేతరం సంబంధం పెట్టుకుందని అనిల్ అనుమానించాడు. ఈ విషయమై తరచూ భార్యతో గొడవపడ్డాడు.
ఈ క్రమంలో శుక్రవారం కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. క్షణికావేశానికి లోనైన అనిల్ వెంట తెచ్చుకున్న కత్తితో భార్య తల నరికాడు. ఆపై ఆ తలను ఒక చేత్తో, కత్తిని మరో చేత్తో పట్టుకుని రోడ్డుపైకి వచ్చాడు. అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.