శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ ఫూంచ్ జిల్లాలో గురువారం జరిగిన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ చర్యల్లో భాగంగా, భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు.
గత నాలుగు రోజుల క్రితం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఫూంచ్ – రాజౌరీ రహదారిని మూసేశారు. ఆ మార్గంలో ఉన్న దట్టమైన అడవుల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారు.