Siachen glacier| లఢక్: సియాచిన్ గ్లేసియర్లోని ఆర్మీ టెంట్లో మంటలు చెలరేగడంతో ఆర్మీ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వెంటనే వీరిని చండీగఢ్లోని దవాఖానకు తరలించారు. మంటల్లో పలు టెంట్లు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో రెజిమెంటల్ మెడికల్ ఆఫీసర్ కెప్టెన్ అన్షుమన్ సింగ్ మరణించినట్టు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడిన జవాన్ల పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు పేర్కొన్నది. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించింది.
సియాచిన్లో అత్యంత విపత్కర వాతావరణ పరిస్థితులు ఉంటాయి. తరచూ హిమపాతాలు సంభవిస్తుంటాయి. ఇక్కడ వాతావరణమే సైనికులకు ప్రధాన శత్రువు. దుర్భర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఒక జవాన్ను కేవలం మూడు నెలలు మాత్రమే ఇక్కడ విధులకు కేటాయిస్తారు. గత 37 ఏండ్లలో ఇక్కడ దాదాపు 800 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.