ఇంఫాల్: మణిపూర్లో ఓ ఆర్మీ అధికారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. తౌబాల్ జిల్లాకు చెందిన ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ కొన్సం ఖేడా సింగ్ తన ఇంట్లో ఉండగా శుక్రవారం ఉదయం కొందరు కిడ్నాప్ చేసి వాహనంలో తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన భద్రతా ఖేడా సింగ్ను సాయంత్రానికి కాపాడాయి. కాగా, మణిపూర్లో గత ఏడాది మే నెలలో రెండు వర్గాల మధ్య హింస మొదలైన నాటి నుంచి మిలిటెంట్లు.. పోలీసులు, సైనికులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
గత సెప్టెంబర్లో అస్సాం రెజిమెంట్ మాజీ సైనికుడు సెర్టో థాంగ్థాంగ్ కోమ్ను కిడ్నాప్ చేసి హత్య చేశారు. రెండు నెలల తర్వాత జమ్ము కశ్మీర్లో పని చేసే ఓ సైనికుడి నలుగురు కుటుంబసభ్యులపై దాడి చేసి హతమార్చారు. ఫిబ్రవరి 27న మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఒక అడిషనల్ ఎస్పీని కూడా కిడ్నాప్ చేశారు. సైనికులు, పోలీసులు ఇంటి దగ్గర ఉన్నప్పుడే మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది.