తిరువనంతపురం: ఒక ఆర్మీ జవాన్ను కొందరు వ్యక్తులు కొట్టారు. (Army jawan attacked) అనంతరం ఆయన వీపుపై ‘పీఎఫ్ఐ’ అని పెయింట్తో రాశారు. బాధిత జవాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోని కొల్లాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి కడక్కల్లో తన ఇంటి పక్కనే ఉన్న రబ్బరు అడవిలో ఆరుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఆర్మీ జవాన్ షైన్ కుమార్ తెలిపాడు. ఈ సందర్భంగా వారు తన చేతులను టేప్తో కట్టేశారని, ఆ తర్వాత తన వీపుపై ‘పీఎఫ్ఐ’ అని ఆకుపచ్చ పెయింట్తో రాసినట్లు ఆరోపించాడు. దీని గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, పీఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఇస్లామిక్ సంస్థకు చెందిన ఈ పార్టీపై దేశంలో నిషేధం విధించారు. అలాగే పీఎఫ్ఐ కార్యకలాపాలు, ఆర్థిక వనరులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్నాయి.