గ్యాంగ్టక్, అక్టోబర్ 13: కుండపోత వర్షాల కారణంగా సిక్కింలోని చుంగ్తాంగ్ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్డు దెబ్బతినడంతో సుమారు 550 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని సైన్యం వెల్లడించింది. వారికి ఆహారపదార్థాలు, వైద్యం అందిస్తున్నట్టు పేర్కొన్నది. దెబ్బతిన్న రోడ్డును బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ పునరుద్ధరిస్తున్నట్టు తెలిపింది. వర్షం కారణంగా పునురుద్ధరణ పనులకు ఆటంకం కలుగుతున్నదని, పర్యాటకులను లాచుంగ్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించింది. ఉత్తర సిక్కిం ప్రాంతానికి పర్యాటకుల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలిపింది.