జమ్మూ: యురి ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం పాక్పై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ సర్కార్ అన్ని అబద్ధాలు చెబుతోందని, సర్జికల్ స్ట్రయిక్స్ చెందిన ఆధారాలు చూపించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్వజయ్ సింగ్ ఆరోపించారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలను ఇవాళ రాహుల్ గాంధీ ఖండించారు. జమ్మూలో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ వ్యాఖ్యలతో విభేదిస్తున్నట్లు తెలిపారు. దిగ్విజయ్వి అర్ధరహిత వ్యాఖ్యలు అని రాహుల్ అన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలను తాము వ్యతిరేకిస్తున్నామని, పార్టీ అభిప్రాయాలు.. దిగ్విజయ్ అభిప్రాయాల కన్నా ముఖ్యమైనవని రాహుల్ అన్నారు.
చర్చల ద్వారా పార్టీ అభిప్రాయాలు ఉత్పన్నం అవుతాయని, కానీ దిగ్విజయ్ వ్యాఖ్యలు ఆయన స్వంత అభిప్రాయాలని, ఆ అభిప్రాయాలకు పార్టీతో సంబంధం లేదని, సైనిక దళాల పనితీరు విషయంలో తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని, ఆ దళాలు అసాధారణ రీతిలో పనిచేస్తున్నాయని, వాళ్లు ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ తెలిపారు. సోమవారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్న దిగ్విజయ్.. సర్జికల్ స్ట్రయిక్స్పై కామెంట్ చేశారు. దీంతో ఆ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నష్టనిరవారణ చర్యలు చేపట్టారు.
జమ్మూకశ్మీర్లోని యురి బేస్పై 2016లో ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో 18 మంది సైనికులు చనిపోయారు. ఆ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. 2019లో పుల్వామాలో భారత సైనిక కాన్వాయ్పై ఉగ్రవాదులు అటాక్ చేశారు. పాక్లోని జైషే గ్రూపు ఆ దాడి చేసింది. ఆ దాడి తర్వాత భారత సైన్యం .. పాక్లోని బాలాకోట్పై వైమానిక దాడులు చేసింది.
#WATCH | We don't appreciate Digvijaya Singh's personal views. His views are outlying views. We are absolutely clear that the Armed Forces do their job exceptionally well and they do not need to provide proof of that: Congress MP Rahul Gandhi pic.twitter.com/O67iRg8aNk
— ANI (@ANI) January 24, 2023