న్యూఢిల్లీ: ఆఫ్రికా ఖండంలోని దక్షిణాది దేశాల్లో కొత్త రకం కరోనా మహమ్మారి ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ( Aravind Kejriwal ) ఆందోళన వ్యక్తంచేశారు. భారత్ నుంచి ఆయా దేశాలకు విమానాల రాకపోకలను నిలిపివేయాలని ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. కరోనా కొత్త వేరియంట్ ప్రభావిత దేశాలకు విమానాల రాకపోకలను నిలిపివేయాలని నేను గౌరవ ప్రధానమంత్రిని కోరుతున్నా. మనం ఎన్నో కష్టాలు పడి కరోనా బారి నుంచి కోలుకున్నాం. కాబట్టి ఈ కొత్త వేరియంట్ దేశంలో ప్రవేశించకుండా అడ్డుకోవడానికి మనం అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని కేజ్రివాల్ ట్వీట్ చేశారు.