న్యూఢిల్లీ, అక్టోబర్ 19: రక్షణశాఖ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అరమనె గిరిధర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శిగా ఉన్నారు.
ఈ నెల 31న ప్రస్తుత రక్షణశాఖ కార్యదర్శి అజయ్కుమార్ పదవీకాలం ముగియనున్నది. ఆయన స్థానంలో గిరిధర్ బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శిగా గిరిధర్ స్థానంలో అల్కా ఉపాధ్యాయ బాధ్యతలు చేపట్టనున్నారు.