అహ్మదాబాద్: గుజరాత్లో రెండో దశ (చివరి దశ) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మందకొడిగా కొనసాగింది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటర్ల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. ఎక్కడా భారీ క్యూలైన్లు కనిపించలేదు. దాంతో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది.
సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 58.68 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కేంద్రం ఎన్నికల సంఘం ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, వివిధ పోలింగ్ బూత్లలో నిర్ణీత గడువు ముగిసే సమయానికి (ఐదు గంటల తర్వాత) కొంత మంది లైన్లలో ఉండటంతో పోల్ పర్సెంట్ కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నదని ఈసీ తెలిపింది.