బెంగళూరు : బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం ధాటికి ఆదివారం బెంగళూరు నగరం అతలాకుతలమైంది. పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. పలు కాలనీలను వరద నీరు ముంచెత్తగా, ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారని వార్తలు వెలువడ్డాయి. కేఆర్ సర్కిల్ అండర్పాస్లో వర్షపు నీటిలో ఏపీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ భాను రేఖ కారు చిక్కుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అకాల వర్షంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.