న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు చెందిన దాసరి చందు(20) అనే ఓ మెడికల్ విద్యార్థి కిర్గిస్థాన్లో మరణించాడు. అక్కడ గడ్డకట్టిన ఒక జలపాతంలో చిక్కుకొని అతను మృతిచెందాడని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
అనకాపల్లికి చెందిన చందు కిర్గిస్థాన్లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చందు మరో నలుగురు స్నేహితులతో కలిసి ఆదివారం జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లారు.