Anubrata Mondal | పశువుల స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్ నేత అనుబ్రత మొండాల్కు అసాన్సోల్ కోర్టు ఈ నెల 20 వరకు సీబీఐ కస్టడీ విధించింది. తొలుత సీబీఐ అనుబ్రత మొండాల్ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరింది. కానీ, న్యాయస్థానం తొమ్మిది రోజుల కస్టడీ మాత్రమే విధించింది. ఆయనను సీబీఐ గురువారం రాత్రి కోల్కతాలోని నిజాం ప్యాలెస్లో గల సీబీఐ కార్యాలయానికి తరలించవచ్చునని భావిస్తున్నారు. అయితే, కోర్టు బయట గుమిగూడిన ప్రజానీకం `చోర్చోర్` అని నినాదాలు చేశారు. అనుబ్రత మొండాల్పై చెప్పులు, బూట్లు విసిరారు.
`అధికార పార్టీకి చెందిన వారిపై ఇటువంటి వైఖరే ప్రదర్శిస్తుందని మేం అంచనా వేశాం. వారిపై పలు ఆరోపణలు ఉన్నాయి. కానీ వారికేం కాదు. డబ్బు సంచులతో పట్టుబడ్డ జార్ఖండ్ ఎమ్మెల్యేల విషయంలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పేరు వచ్చింది. కానీ సీబీఐ గానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గానీ ఎటువంటి చర్య తీసుకోలేదు` అని పశ్చిమబెంగాల్ మంత్రి చంద్రిమా భట్టాచార్య ఆరోపించారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. ఈడీ, సీబీఐ పక్షపాతానికి వ్యతిరేకంగా తమ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో ప్రతి జిల్లాలో నిరసన తెలుపుతాం అని అన్నారు.
తాము చట్ట విరుద్ధ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వబోమని తృణమూల్ నేత, మంత్రి చంద్రిమా భట్టాచార్య అన్నారు. తాము తటస్థ వైఖరిని ప్రదర్శిస్తామన్నారు. తమ పార్టీ ప్రజల మద్దతుతో ఏర్పాటైందన్నారు. తప్పుడు పనులతో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.
#WATCH | West Bengal: Anger in people as they show shoes, shout slogans of 'chor, chor' during the production of TMC Birbhum district president Anubrata Mondal in a special CBI court of Asansol. Mondal had been arrested by the CBI in a cattle smuggling case. https://t.co/iE0Ui4xTQ6 pic.twitter.com/Z8yqQWI3JE
— ANI (@ANI) August 11, 2022