న్యూఢిల్లీ: రైళ్లు ఢీకొనకుండా ఉండేందుకు ప్రత్యేక కవచ్ వ్యవస్థ(Kavach System)ను డెవలప్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఒడిశాలో జరిగిన భీకర రైలు ప్రమాదం 261 మంది ప్రాణాలను బలి తీసుకున్నది. మూడు రైళ్లు ఢీకొన్న సమయంలో కవచ్ వ్యవస్థ ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ రూట్లో యాంటీ కొలిజన్ వ్యవస్థ అయిన కవచ్ సిస్టమ్ లేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని, ఇక రైల్వే లైన్ పునరుద్దరణ పనులు మొదలుపెడుతున్నామని, ప్రమాదం జరిగిన రూట్లో కవచ్ రక్షణ వ్యవస్థ లేదని భారతీయ రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు.
రైలు ప్రమాదాలను నివారించేందుకు దేశవ్యాప్తంగా కవచ్ వ్యవస్థను రైల్వేశాఖ ఇన్స్టాల్ చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం బాలాసోర్ వద్ద జరిగిన ప్రమాదానికి కారణం ఏంటన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. బహుశా సిగ్నల్ వైఫల్యం అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కవచ్ వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదం చాలా తీవ్రంగా మారింది.