పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన ‘యాంటీషిప్ మిస్సైల్’ను విజయవంతంగా పరీక్షించినట్టు డీఆర్డీవో తెలిపింది.
వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ నుంచి ఈ క్షిపణిని ఒడిశా తీరంలో పరీక్షించామని, నిర్దేశించిన లక్ష్యాన్ని క్షిపణి ఛేదించిందని వెల్లడించింది.