Google | న్యూఢిల్లీ, జనవరి 16: టెక్ కంపెనీలలో ఈ ఏడాది కూడా ఉద్యోగుల తొలగింపు కొనసాగుతున్నది. తాజాగా మరోసారి ఉద్యోగులు ఉద్వాసనకు టెక్ దిగ్గజం గూగుల్ రంగం సిద్ధం చేసుకుంది. సుమారు వెయ్యి మందిని ఇంటికి సాగనంపుతున్నట్టు ప్రకటించింది. హార్డ్వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్, గూగుల్ అసిస్టెంట్ సహా పలు విభాగాలకు చెందిన వారిని తొలగిస్తూ సంబంధిత ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపింది. వ్యాపార ప్రాథమ్యాలలో మార్పుల కారణంగా తొలగింపులు అనివార్యమైందని, ఈ నిర్ణయం కష్టంగా ఉందని, దీనిని తెలియజేయడానికి చింతిస్తున్నట్టు పేర్కొంది. అర్హులైన ఉద్యోగులకు పరిష్కార వేతనం చెల్లిస్తామని, అదే విధంగా ఇతర విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.