Adani Group | న్యూ ఢిల్లీ: అదానీ గ్రూపు సంస్థలపై అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ నివేదిక నేపథ్యంలో సుప్రీంకోర్టులో గురువారం మరో పిటిషన్ దాఖలైంది. భారీగా ప్రజాధనం లూటీ, షేర్ల ధరల తారుమారు ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ప్యానెల్ పర్యవేక్షణలో పలు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని పిటిషన్లో కోరారు. ఇప్పటికే దాఖలైన మూడు పిటిషన్లను 17న కోర్టు విచారించనున్నది.