న్యూఢిల్లీ: అమెరికాలోని ఓహియోలో భారతీయ విద్యార్థి(Indian Student) మృతిచెందాడు. న్యూయార్క్లో ఉన్న భారతీయ కౌన్సులేట్ ఈ విషయాన్ని తెలిపింది. ఆ విద్యార్థి మరణంపై దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు. ఆ స్టూడెంట్ను ఉమా సత్య సాయిగా గుర్తించారు. అతను క్లీవ్లాండ్లో చదువుకుంటున్నాడు. విద్యార్థి మృతి పట్ల అతని కుటుంబానికి కౌన్సులేట్ సంతాపం వ్యక్తం చేసింది. సత్య సాయి పార్దీవదేహాన్ని ఇండియాకు తరలించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కౌన్సులేట్ తెలుస్తోంది.
అమెరికాలో ఈ ఏడాది భారతీయ విద్యార్థుల మృతి చెందిన వారి సంఖ్య ఇప్పటికే 10కి చేరుకున్నది. మార్చి నెలలో కూడా క్లీవ్లాండ్లోనే భారతీయ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అరాఫత్ అదృశ్యం అయ్యాడు. అయితే అతని కుటుంబానికి ఫోన్ కాల్స్ వచ్చాయి. డబ్బులు ఇస్తే విడుదల చేస్తామని ఆ ఫోన్ కాల్లో హెచ్చరించారు.