న్యూఢిల్లీ: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతిచెందాడు. ఓహి యో రాష్ట్రంలోని సిన్సినాటిలో గురువారం అతడి మృతదేహం లభ్యమైంది. మరణానికి కారణాలు తెలియలేదు. వారం వ్యవధిలోనే ముగ్గు రు భారతీయ విద్యార్థులు చనిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. జనవరిలో వివేక్ సైనిని ఓ డ్రగ్స్ బానిస సుత్తితో కొట్టి చంపాడు. నీల్ ఆచార్య అనే విద్యార్థి యూనివర్సిటీ ప్రాంగణంలో శవమై కనిపించాడు.