లక్నో: ఉత్తరప్రదేశ్లో మరో గ్యాంగ్స్టర్ హత్యకు గురయ్యాడు. కోర్టు ప్రాంగణంలోనే అతడిని దుండగులు కాల్చి చంపారు. గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తర్ అన్సారీ అనుచరుడు సంజీవ్ మహేశ్వరి జీవ లక్నో జైలులో ఉన్నాడు. ఓ కేసు విచారణ కోసం ఆయనను బుధవారం పోలీసులు లక్నో కోర్టుకు తీసుకువచ్చారు.
కోర్టు ప్రాంగణంలోనే, పోలీసుల కళ్లెదుటే కొందరు దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో సంజీవ్ మహేశ్వరి అక్కడికక్కడే మరణించాడు. దుండగులు న్యాయవాదుల దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుడు ఓ బీజేపీ నేత హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు.