లక్నో, మే 4: ఉత్తరప్రదేశ్లో మరో గ్యాంగ్స్టర్ హతమయ్యాడు. పశ్చిమ యూపీకి చెందిన కరుడుగట్టిన నేరస్థుడు అనిల్ దుజానాను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం ఎన్కౌంటర్ చేశారు. అనిల్ దుజానాపై హత్య, దోపిడీ, భూకబ్జాలు వంటి మొత్తం 62 కేసులు ఉన్నాయి. ఇందులో 18 మర్డర్ కేసులు ఉన్నాయి.
ఓ కేసులో జైలులో ఉన్న అనిల్ దుజానా ఏప్రిల్ 10న బెయిల్పై బయటకు వచ్చాడు. తన కేసుల్లో సాక్షులపై అతడు బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు.