న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాన్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో మరో వివాదం తలెత్తింది. వర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్-2 బిల్డింగ్ గోడలపై, పలువురు ఫ్యాకల్టీ గది తలుపులపై గుర్తు తెలియని వ్యక్తులు అభ్యంతకర రాతలు రాశారు. ‘బ్రాహ్మణులు క్యాంపస్ను విడిచివెళ్లాలి. బ్రాహ్మణులు, బనియా (వ్యాపారులు)లపై ప్రతీకారం తీర్చుకుంటాం.
బ్రాహ్మణులారా భారత్ను విడిచివెళ్లండి’ అనే వ్యాఖ్యలు గోడలపై కనిపించాయి. దీనిపై విచారణ జరిపించాలని జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ స్టూడెంట్ యూనియన్, టీచర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఇది లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న విద్యార్థుల పనేనని ఏబీవీపీ ఆరోపించింది. ఈ ఘటనపై జేఎన్యూ వైస్ చాన్స్లర్ శాంతిశ్రీ పండిట్ దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, గోడలపై అభ్యంతకర వ్యాఖ్యలు కనిపించిన నేపథ్యంలో అన్ని కేంద్రాల్లో వెంటనే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జేఎన్యూ కోరింది.