బెంగళూరు, జనవరి 17: కర్ణాటకలోని బీజేపీ సర్కార్కు కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ పనుల మీద ఉండటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్డులో భారీ గొయ్యి ఏర్పడిన ఘటన మరువకముందే అలాంటి ఘటన మరొకటి వెలుగుచూసింది. బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ రోడ్డు మార్గంలో మంగళవారం ఓ గుంత ఏర్పడింది. కొద్ది రోజుల కిందట ఇక్కడ పైప్లైన్ పనులు చేపట్టారు. అనంతరం తూతూమంత్రంగా రోడ్డువేసి చేతులు దులుపుకొన్నారు. అయితే మంగళవారం ఈ మార్గంలో ఓ లారీ ప్రయాణిస్తుండగా రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయి గుంత ఏర్పడింది. విషయం తెలిసిన అధికారులు గుంతను పూడ్చడానికి చర్యలు చేపట్టారు.