న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ తయారు చేస్తున్న ఐఫోన్లు, ఐప్యాడ్లు సహా వివిధ రకాల గ్యాడ్జెట్లలో లైట్నింగ్ కనెక్టర్కు బదులుగా యూఎస్బీ టైప్-సీ పోర్టును ఏర్పాటు చేసేలా ఆ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) చట్టసభల సభ్యులు ఇప్పుడు ఆండ్రాయిడ్పై దృష్టి సారించారు. ఆండ్రాయిడ్ ఫోన్లకు కనీసం ఐదేండ్లపాటు తప్పనిసరిగా సాఫ్ట్వేర్ అప్డేట్లను అందించేలా వాటి తయారీదారులను ఒప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నిబంధనల ముసాయిదాను ప్రస్తుతం ఈయూ పరిశీలిస్తున్నట్టు ‘9టూ5 గూగుల్’ వెల్లడించింది.