శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో రసవత్తరమైన పోటీకి తెరలేచింది. లోక్సభ బరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేరుగా తలపడనున్నారు. అనంతనాగ్-రాజౌరీ లోక్సభ నియోజకవర్గం నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, డీపీఏపీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ బరిలో దిగుతున్నారు. ఇక ఇండియా కూటమి తరఫున నేషనల్ కాన్ఫరెన్స్ నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్ పోటీ పడుతున్నారు. అనంత్నాగ్లోని బిజ్బెహరాకు చెందిన ముఫ్తీ తాను పోటీ చేసే స్థానాన్ని ఆదివారం ప్రకటించారు. గతంలోనూ ఇక్కడ పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన ఆమె తన ప్రాబల్యాన్ని నిరూపించుకోవడానికి మరోసారి బరిలో దిగుతున్నారు. ఇక 2022లో కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీ స్థాపించిన గులాం నబీ ఆజాద్ ప్రధాన పోటీదారుగా బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన జస్టిస్ హస్నైన్ మసూది గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి రెండు, ముఫ్తీ మూడో స్థానంలో నిలిచారు. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఇటీవల వరకు ఇండియా కూటమి భాగస్వామిలో ఉన్నప్పటికీ నేషనల్ కాన్ఫరెన్స్ తన అభ్యర్థులను ప్రకటించడంతో పొత్తు విచ్ఛిన్నమైంది.