న్యూఢిల్లీ : కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra) సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తరచూ ఇన్స్పిరేషనల్ పోస్ట్లు షేర్ చేస్తుంటారు. లేటెస్ట్గా మహీంద్ర గ్రూప్ చీఫ్ ట్విట్టర్లో ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో మోటార్సైక్లిస్ట్ తన భుజానికి పెంపుడు కుక్కను తగిలించుకుని వెళుతుండటం కనిపిస్తుంది.
Is there any better clip to convey a #SundayFeeling ? pic.twitter.com/skDFo1DCCY
— anand mahindra (@anandmahindra) March 26, 2023
ఈ వీడియోను నెట్టింట షేర్ చేసిన కొద్దిసేపటికే అభిషేక్ జైస్వాల్ అనే వ్యక్తి ఆసక్తికరమైన ప్రశ్నను ఆనంద్ మహీంద్ర ముందుంచారు. సార్ నాకు ఓ చిన్న సందేహం..మీరు ఇంత బడా పారిశ్రామికవేత్త అయినా ఆదివారం ఎలా ఎంజాయ్ చేస్తారని ఆ వ్యక్తి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బిలియనీర్ ఏమాత్రం తడుముకోకుండా బదులిచ్చారు.
ఆదివారం ఎంజాయ్ చేసేందుకు ఎంతో ఉపయుక్తమైన టెక్నిక్ ఉపయోగిస్తాను..ఆదివారం నాడు తాను ఓ పారిశ్రామికవేత్తననే విషయం మరిచిపోతానని హిలేరియస్ రిప్లై ఇచ్చారు. బిలియనీర్ సమాధానానికి ట్విట్టర్ యూజర్ల నుంచి మెరుగైన స్పందన లభించింది. మీరు ఎంచుకున్న విధానం సరైందని ఓ యూజర్ కామెంట్ చేయగా వావ్ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :