నోయిడాలోని సూపర్టెక్ ట్విన్ టవర్స్ను ఆగస్టు 28న కేవలం 9 సెకన్లలో నేలమట్టం చేశారు. కళ్లు మూసి తెరిచేలోగా అతిపెద్ద భవనం కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే, ఈ వీడియోను మండే మోటివేషన్గా మలుచుకున్నారు ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్ర అండ్ మహీంద్ర చైర్మన్ ఆనంద్ మహీంద్ర. ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
‘ట్విన్ టవర్స్ను నా మండే మోటివేషన్గా ఎంచుకోవడానికి కారణముంది. మన అహంభావాలు పెరిగిపోవడం చాలా ప్రమాదకరం. అందుకే పెరిగిన ఈగోను పేల్చేయడానికి కొన్నిసార్లు మనకు పేలుడు పదార్థాలు అవసరం.’ అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. చాలామంది ఈ ట్వీట్తో ఏకీభవించారు. దేశంలోని రాజకీయ నాయకులను మోటివేట్ చేసేందుకు మీరూ ఇలాంటి స్ఫూర్తిదాయక ట్వీట్లు పెడుతూనే ఉండాలని ఆనంద్ మహీంద్రను ఓ నెటిజన్ కోరారు.
Why am I using the demolition of the Noida towers for #MondayMotivation ? Because it reminds me of the dangers of letting our egos get too tall. Sometimes we need explosives to demolish the excess ego. pic.twitter.com/qSMl2qSera
— anand mahindra (@anandmahindra) August 29, 2022